Thursday, April 18, 2013

నిరంజన రాముడు


ఎటువంటి మచ్చ లేని వాడయిన(నిరంజనుడయిన) రాముడే విశిష్టమయినవాడు. మిగితా అంతా మలినమయినది. సృష్టి కళంకితమయింది. ఓంకారమూ కళంకితమే. అశుద్ధత ఈ అపవిత్రతను ఇంకా వ్యాపించేలా చేస్తోంది. విధి అయిన బ్రహ్మ, శంకరుడూ, ఇంద్రుడూ అందరూ కల్మషులు. గోవిందుడు-గోపికలతో పాటూ కళంకితుడు.
మాట-పాట-నృత్యం అశుద్ధాలు. వేదాలు కళంకితమయినవి. చదువు, పాఠం, నేర్పు, పాట, నృత్యం గ్రంథ-పుస్తకాలన్నీ మలినమయినవి.
జ్ఞానం అందరి నోళ్ళలో పడి చెడిపోయింది. కానీ రాముడు మాత్రం మలిన రహితుడు, కళంక రహితుడు, కల్మష రహితుడు. ఇదే కబీరు వాక్కు. 

No comments:

Post a Comment