Monday, September 19, 2011

మన ప్రస్తుత సామాజిక దుఃస్థితి

ప్రశాంత్ గారి ఆంగ్ల బ్లాగు "No green grass on the other bank" సౌజన్యంతో


http://prasanthias.wordpress.com/2011/09/13/the-long-pole/ అను ఈ బ్లాగు చదివిన వెంటనే నన్ను ఎంతో ప్రభావితం చేసింది, ఇది మన తెలుగు లో కూడా ఉండాలని ఈ టపా రాస్తున్నాను.

అనగనగా ఒక సుదూరపు పల్లె లో ఒక సింహం సివంగి దంపతి నివసించేది. ఆ సింహం ఒక కృషీవలుడు, పొలంపని తప్ప మరేమీ తెలీనివాడు. సివంగి ఒకప్పుడు NREGA, తరువాత రోజుల్లో MGNREGA ద్వారా కూలి పని చేసుకునేది.
అదే గ్రామంలో ఉన్న పిల్లి షావుకారు గారి 50 ఎకరాల వరి పొలాన్ని సాగు చెయ్యడం మన సింహం గారి జీవని. ఇలా పిల్లి షావుకారు గారి వద్ద కౌలు చెయ్యటం వలన దిగుబడి లో సగభాగం షావుకారి వాటా అయ్యేది. ధాన్యం సాగులోని నష్టాలకు భరించలేక ఏ అరటో, చెఱుకో లేక పొగాకో సాగు చేద్దమనుకున్నాడు సింహం రైతు, కానీ భారత ప్రభుత్వ ధాన్యం భూమి మరియు మాగాణి రక్షణ చట్టం దీనిని అనుమతించదు. (కానీ అదే భూమిని ప్రత్యేక ఆర్థిక మండళ్ళ పేర ప్రైవేటు సంస్థలకు అప్పగించి అందులో ఎంత హానికరమయిన ఫ్యాక్టరీ ని పెట్టినా ప్రభుత్వానికి సమ్మతమే).
ఉడుత సేటు గారి వద్ద అతి ఎక్కువ మొత్తంలో అప్పు చేసినందుకు రైతు సింహం తన ఇల్లును ఉడుతకు SARFAESI Act. కింద అప్పగించాల్సి వచ్చింది.
పంచాయతీ ప్రెసిడెంటు పంది గారు రైతు సింహం కౌలు తీస్కున్న పొలంలోనే బస్టాండు, షాపింగు కాంప్లెక్సు, ఇంకా ఎయిర్పోర్ట్ ఉండాలని నిర్ణయించాడు. ఎందుకంటే ఆ పొలం చుట్టు పక్కల భూములన్నీ అప్పటికే పంది కులంలోని ఇతర పందులు కొనెయ్యటం లేదా కబ్జా చెయ్యటం చేస్సాయి.  ధాన్యం భూమి మరియు మాగాణి రక్షణ చట్టం ప్రకారం సాగు భూమి లో వాణిజ్యపరమయిన పనులు చేయరాదు, కేవలం ధాన్యం సాగుకు మాత్రమే ఆ భూమిని వాడాలి. కానీ సింహం-సివంగి తప్ప ఊరందరికీ ఎయిర్పోర్టు అవసరం కావల్సిన ఆవశ్యకత తెలిసొచ్చింది. అర్జెంటుగా ఊరికొక ఎయిర్పోర్టు కావాలి అన్నదై అందరి వాదన. ఆఖరికి ఊరి బిచ్చగాడయిన ఏనుగుకి కూడా తన సమీప భవిష్యత్తు దృష్ట్యా బస్టాండు-షాపింగ్ మాల్-ఎయిర్పోర్టు కావలని అనిపించింది. బహుళ సమ్మతి ఉంది కాబట్టి వెంటనే చట్టాన్ని రద్దు చెయ్యాలని గ్రామ పెద్దలంతా నిర్ణయం తీస్కున్నారు. టెండరు పిలిపించి ఎల్&టీ సంస్థకు చట్టాల దాగుడుమూతలు మొదలు బస్టాండు-షాపింగ్ కాంప్లెక్సు-ఎయిర్పోర్టు కట్టడం వరకూ అన్ని బాధ్యతలు అప్పగించారు. దీనిని కేవలం దోమ దళితులు మాత్రమే నిరసించారు, కానీ వారు మైనారిటీ లో ఉండటం వలన వారికి కావల్సినంత బలం లేనందున వారి మాటను ఎవరూ పట్టించుకోలేదు. పై పెచ్చు కొన్ని దోమలు చంపివేయబడ్డాయి. ఇదంతా చూస్తున్న మైనారిటీ కమిషన్ షాక్ వ్యక్తపరిచింది, ఆ షాక్ ద్వారా వచ్చిన కరెంటుని గ్రామంలోని అన్ని విద్యుద్దీపాలు వెలిగించడానికి ఉపయోగించారు గ్రామ పెద్దలు.
పోస్టుమ్యాను జెర్రి అప్పుడన్నాడు బలం-స్థాయి అన్నవి మురికి కూపాలు అవినీతి తో కూడుకున్నవి, మరియు పూర్తి బలం-పూర్తి స్థాయి పూర్తి మురికి కూపాలు పూర్తి అవినీతి తో కూడుకున్నవి. అందువల్ల ఊళ్ళో అవినీతి అనేది ఓ పెద్ద సమస్యగా మారిపోయింది. ఊరికి వాయవ్యంలో గల చిట్టడవిలో ఉండే పెళ్ళికాని-ఎటువంటి బాంధవ్యాలు లేని గుడ్లగూబ ఈ పెరిగిపోతున్న అవినీతికి విరుద్ధంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది. దీక్ష వలన ఆ ఊరి దశ మారింది. దీక్షాపరమయిన మార్పులు ఆ ఊర్లో చోటు చేస్కున్నాయి. ఆ ఊరు ఇంకా ఊరులా లేదు(గుడ్లగూబ దీక్ష ను చూడటానికి వచ్చే వాళ్ళ వల్ల, ఊరికి రోడ్లొచ్చాయి, సర్వ వసతులు సమకూరాయి, మీడియా వాళ్ళ సందడి అంతా ఇంతా కాదు. ఊర్లో పిల్ల వాడు తుమ్మినా ది న్యూస్ చానళ్ళు లైవ్ కవరేజ్ ఇవ్వటం మొదలేట్టాయి, ఊరి ప్రాచుర్యాన్ని చూసి అడుగు భూమి ధర అర కోటి అయింది). గుడ్లగూబ ఈ అవినీతి నంటటినీ చూడటానికి, చూసి నిర్మూలించటానికి ఒక పేద్ద స్తూపాన్ని ఊరి నడిబొడ్డున పెట్టమని ఊరిపెద్దలను కోరింది, ఊరిపెద్దలు సరేనన్నారు. గుడ్లగూబ తిరిగి తన చిట్టడవికి చేరింది. ఈ స్తూపాన్ని సింహాలు, పులులు, దోమలు ఉండే వీధులు మాత్రమే కనపడేలా ప్రతిష్టించిన ఊరి పెద్దలయిన పందులు ఉడుతలు, ఎప్పుడు పులులు , సింహాలు, దోమలు తప్పు చేసినా అప్పుడు స్తూపానికి ఒక పేద్ద భూతద్దాన్ని పెట్టి గుడ్లగూబకు జరిగిన తప్పును పది రెట్లు పెద్దదిగా చూపేవి. ఆ విధంగా పందుల నేపధ్యంలో మొత్తం పాలనా వ్యవస్థ సాగుతోంది.
కొద్ది రోజులకి సింహం చనిపోయింది. ఇంకొన్ని రోజుల తరువాత సివంగి కూడా చనిపోయింది. చనిపోని వారంతా ఆ ఊరిలో సుఖంగా బ్రతుకు జీవనం సాగించారు. పది సంవత్సరాల తరువాత ఆడిటర్లు 25 సింహాలు అంతరించిపోయాయి అన్న నివేదిక ను సమర్పించాయి.

No comments:

Post a Comment