Showing posts with label తెలుగు. Show all posts
Showing posts with label తెలుగు. Show all posts

Thursday, March 23, 2017

తెలుగు వికీపీడియా నుండి తెలుగు మహాపదనిధిని రూపొందించడంలో తొలి రోజు

తెలుగు మహాపదనిధి/ తెలుగు కోర్పస్ అనేది తెలుగు భాషకు మనం రూపొందించగలిగిన బృహత్తర వనరు. ఈ కోర్పస్ రూపొందితే, తెలుగులో కొత్త పదాల సృష్టి, ఇప్పటికే ఉన్న పదాల వాడుక, నానార్ధాలు, ఎక్కడ ఎలా ఎవరు వాడారు అన్న విషయాలు తేటతెల్లమవుతాయి. ఈ కోర్పస్ రూపొందించడానికి పాఠ్యం యూనికోడ్ లో ఉండడం మొదటి అవసరం. తెలుగులో అంత ఎక్కువ పాఠ్యం వాడటానికి తయారుగా అందుబాటులో ఉన్న ఒక పెద్ద వనరు తెలుగు వికీపీడియా (తెవికీ).
అందుకని, నేను తెవికీ ని వనరుగా తీసుకొని పదాల నిధిని రూపొందించనున్నాను. 
మొదటి మెట్టు తెవికీ నుండి పాఠ్యాన్ని పొందడం, ఇందుకు ఎన్నో మార్గాలు :
అన్నిటికన్నా సులువైనది వెబ్‌హెచ్‌టిట్రాక్ ను వాడడం. ఇలా చేయడం వలన హెచ్‌టిఎంఎల్ లో పాఠ్యం దింపుకోలవుతుంది. మనం వికీ పేజీలను ఎలా చూస్తామో అలానే దింపుకోబడతాయి, చదవనలమి కాని వికీకోడ్ కనిపించదు. ఇతర మార్గాల్లో వికీ పాఠ్యం దింపుకొనేప్పుడు చాలా సార్లు పట్టికల్లో, మూసల్లో ఉండే పాఠ్యం, వర్గపు వివరాలు రావు. ఐతే హెచ్‌టిఎంఎల్ లోని పాఠ్యంలో ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ, హెచ్‌టిఎంఎల్ ట్యాగులని తీసుకోకుండా, పాఠ్యాన్ని వడపోయడం కాస్త కష్టతరమైన పనే! అలానే ఇలాంటి పద్ధతుల్లో లంకెను పట్టుకొని పేజీని, ఆ పేజీలో లంకెలతో పేజీలని పట్టుకుని వెబ్సైట్ మొత్తం భద్రపరుస్తాం, అంచేత కొన్ని పేజీలు ఒకటికన్నా ఎక్కువసార్లు దింపుకోలవుతాయి, అగాధ-అనాధ పేజీలు దింపుకోబడవు. మనకు నచ్చిన వ్యాసాలే వచ్చేలా చేయలేం.

పైవికిబాట్ వాడి మనకు నచ్చిన పేజీల వరకు తోడుకోవచ్చు. కానీ ఇది చాలా సమయం తీసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక పాఠ్యపు డేటాబేస్ టేబుళ్ళు పైవీకిబాట్ కు అందుబాటులో ఉండకపోవచ్చు.

ఇక ఆటోవికి బ్రౌజర్, AWB, వాడాలంటే పలు సమస్యలున్నాయి, కేవలం విండోస్ కే పరిమితమవ్వాలి. యూనికోడ్ పాఠ్యాన్ని సమర్ధవంతంగా ఆడించలేదు. ఇది నేనెక్కువగా వాడలేదు కనుక పెద్దగా తెలీదు కూడా!

ఏదేమైనా, మనకి వికీమీడియా ఇంజనీరింగ్ టీం వారు, ఔత్సాహికుల చలవ వల్ల వికీపీడియా పేజీలన్నీ డేటాబేస్ డంపుల రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఇవి కింది చూపిన విధంగా dumps.wikimedia.org వద్ద లభిస్తాయి :
  1. Articles, templates, media/file descriptions, and primary meta-pages, in multiple bz2 streams, 100 pages per stream
    • tewiki-20170320-pages-articles-multistream.xml.bz2 92.6 MB
    • tewiki-20170320-pages-articles-multistream-index.txt.bz2 1.1 MB
    • tewiki-20170320-pages-meta-history.xml.bz2
  2. history content of flow pages in xml format. These files contain flow page content in xml format.
    • tewiki-20170320-flowhistory.xml.bz2 12 KB
  3. content of flow pages in xml format. These files contain flow page content in xml format.
    • tewiki-20170320-flow.xml.bz2 10 KB
  4. Log events to all pages and users. This contains the log of actions performed on pages and users.
    • tewiki-20170320-pages-logging.xml.gz 7.1 MB
  5. All pages, current versions only.
    • tewiki-20170320-pages-meta-current.xml.bz2 105.8 MB
  6. Articles, templates, media/file descriptions, and primary meta-pages.
    • tewiki-20170320-pages-articles.xml.bz2 88.6 MB
  7. First-pass for page XML data dumps. These files contain no page text, only revision metadata.
    • tewiki-20170320-stub-meta-history.xml.gz 127.5 MB
    • tewiki-20170320-stub-meta-current.xml.gz 16.0 MB
    • tewiki-20170320-stub-articles.xml.gz 11.1 MB
  8. Extracted page abstracts for Yahoo: tewiki (ID 3495) 15974 pages (118.4|3173.4/sec all|curr), 15974 revs (118.4|193.5/sec all|curr), ETA [max 237881]
    • tewiki-20170320-abstract.xml 150.8 MB
  9. List of all page titles
    • tewiki-20170320-all-titles.gz 1.4 MB
  10. List of page titles in main namespace
    • tewiki-20170320-all-titles-in-ns0.gz 619 KB
  11. Namespaces, namespace aliases, magic words.
    • tewiki-20170320-siteinfo-namespaces.json 18 KB
  12. Wiki page-to-page link records.
    • tewiki-20170320-pagelinks.sql.gz 24.6 MB
  13. List of pages' geographical coordinates
    • tewiki-20170320-geo_tags.sql.gz 106 KB
  14. Name/value pairs for pages.
    • tewiki-20170320-page_props.sql.gz 1.3 MB
  15. List of annotations (tags) for revisions and log entries
    • tewiki-20170320-change_tag.sql.gz 212 KB
  16. Wiki category membership link records.
    • tewiki-20170320-categorylinks.sql.gz 6.2 MB
  17. Wiki external URL link records.
    • tewiki-20170320-externallinks.sql.gz 8.3 MB
  18. Interwiki link tracking records
    • tewiki-20170320-iwlinks.sql.gz 859 KB
  19. Nonexistent pages that have been protected.
    • tewiki-20170320-protected_titles.sql.gz 1 KB
  20. Wiki template inclusion link records.
    • tewiki-20170320-templatelinks.sql.gz 5.4 MB
  21. Redirect list
    • tewiki-20170320-redirect.sql.gz 340 KB
  22. A few statistics such as the page count.
    • tewiki-20170320-site_stats.sql.gz 801 bytes
  23. User group assignments.
    • tewiki-20170320-user_groups.sql.gz 1 KB
  24. This contains the SiteMatrix information from meta.wikimedia.org provided as a table.
    • tewiki-20170320-sites.sql.gz 19 KB
  25. Wiki media/files usage records.
    • tewiki-20170320-imagelinks.sql.gz 2.0 MB
  26. Category information.
    • tewiki-20170320-category.sql.gz 359 KB
  27. Base per-page data (id, title, old restrictions, etc).
    • tewiki-20170320-page.sql.gz 7.0 MB
  28. Newer per-page restrictions table.
    • tewiki-20170320-page_restrictions.sql.gz 3 KB
  29. Tracks which pages use which Wikidata items or properties and what aspect (e.g. item label) is used.
    • tewiki-20170320-wbc_entity_usage.sql.gz 929 KB
  30. Metadata on current versions of uploaded media/files.
    • tewiki-20170320-image.sql.gz 1.6 MB
  31. Wiki interlanguage link records.
    • tewiki-20170320-langlinks.sql.gz 9.2 MB
ప్రతి ఒక్క వికీకి సంబంధించి ఈ విధంగా పలు డంపులు అందుబాటులో ఉంటాయి. నేను పదనిధి కోసం పైనిచ్చిన జాబితాలోని ఐదవ అంశాన్ని ఎంచుకుంటున్నాను. ఇందులో ఆనాటి వికీపేజీ స్థితి నిక్షిప్తమై ఉంటుంది. ఈ కింది ఆదేశాన్ని ఆడించి మీరు ఆ పేజీల డంపును పొందవచ్చు:
wget https://dumps.wikimedia.org/tewiki/20170320/tewiki-20170320-pages-meta-current.xml.bz2
పై దస్త్రం పేరు ప్రకారం అది ప్రస్తుత స్థితి (అనగా ౨౦౧౭, మార్చ్ ౨౦ నాటి) వికీపీడియా పేజీలన్నిటిని వాటి అప్పటి స్థితిలో దింపుకుంటుంది.

Friday, September 5, 2014

సరదా కోసం, ఒక పొట్టి కథ అనువాదం

ఈ మధ్య ఎవరి వద్దకు కలవడానికి వెళ్ళినే మీరేమయినా రచనలు చేసారా అన ప్రశ్న ఎదురవుతుంది.
ఎప్పటి నుండో (నాకు ఊహ తెలిసినప్పటి నుండి) నా సొంత కథ వ్రాయాలన్నది కోరిక.
సరే అందుకు ఇప్పుడు శ్రీకారం.

కోరా లో దొరికిన ఒక ఆంగ్ల కథకు అనువాదం

౩౭ యేళ్ళ సుదీర్ఘ దాంపత్య జీవితం గడిపేసరికి గురునాధానికి భార్య ఆండాళ్ళు మీద మనసు సన్నగిల్లింది. కొత్తగా చేరిన సెక్రెటరీ తాయారమ్మ మీద కన్ను పడింది. తాయారమ్మ గడుసుదాయే, ఇంట్లో నుండి ఆండాళ్ళుని తరిమేస్తేనే కాపరానికి వస్తానంది. లంకంత ఇల్లు - కోట్ల విలువ కలిగింది. ఆండాళ్ళు ఏం చేస్తుంది, పాపం - కోర్టుకు వెళ్ళింది. గురునాధం ఘటికుడు, గట్టి లాయర్లను పెట్టి పది లక్షల జరిమానాకు విడాకులకు ఒప్పించాడు.

ఆండాళ్ళుకి మూడు రోజుల వ్యవధి ఇచ్చాడు. ఆమె మొదటి రోజంతా సొత్తు మూటకట్టుకోటంలో గడిపేసింది, రెండో రోజు పనిమనుషులను పెటించి ఆ సామానంతా పుట్టింటికి మార్పించింది.
మూడో రోజు పెద్ద విందు ఏర్పాటు చేయించింది. విందు కోసం మాంఛి ఱొయ్యలు, పీతలు, చేపలు వండించింది. ముందు రోజు సహాయం చేసిన పనిమనుషులందరికీ విందు ఘనంగా చేయించింది. గురునాథానికీ, తాయారమ్మకీ టైం లేక విందుకు రాలేదని చెప్పించి, డీవీ మేనర్ కు వెళ్ళి సుష్టుగా భోంచేసి ఐనాక్స్ కి సినిమా చూట్టానికి వెళ్ళారు. పని మనుషులంతా భుక్తాయాసంతో సేదదీరారు.
ఇక ఆండాళ్ళు ఏడుస్తూ దిగాలుగా అన్ని గదులూ పరికిస్తూ, ప్రతీ వస్తువునూ పలకరిస్తూ వీడుకోలు చెబుతూ ఉంది. గురునాధానికి పూల సజ్జలంటే మహా ఇష్టం, పూల సజ్జల కోసం ఏనుగు దంతంతో చేసిన గిన్నెలను చేయించి అన్ని గదుల్లోనూ అమర్చాడు. వాడికి ఆ గిన్నెలంటే ఎంతిష్టమంటే ఆండాళ్ళుని ఒక్క గిన్నె కూడా ముట్టుకోవద్దని హెచ్చరించేవాడు.
ఆండాళ్ళు తనతో పాటు ఒక సంచిలో శుభ్రం చేసాక వచ్చిన చేప తోలుకుండే గుండ్రటి పొట్టు, రొయ్య తలలు, పీతల వ్యర్థం వేసుకుని తెచ్చింది. ఒక్కో ఏనుగు దంతం గిన్నెలో గుప్పెడు పొట్టు వేసుకుంటూ అన్ని గదుల్లో తిరగాడింది.
గురునాధం వచ్చే సమయానికి ఆమె ఇల్లు వదిలి వెళ్ళిపోయింది.
తాయారమ్మకి ఆ ఇంట్లో భూతల స్వర్గం కనిపించింది. ఇద్దరూ సంతోషంగా కలకాలం ఉందామని తీర్మానించుకొని నిద్రపోయారు.
రెండో రోజు ఉదయం నుండి ఇంట్లో ఏదో తెలీని దుర్వాసన. గదులన్నీ శుభ్రం చేయించారు, ఎలుకలు ఎక్కడయినా చచ్చి పడున్నాయేమో వెతికించారు, సెంటు బాటిళ్ళు పదుల్లో కొని ఇల్లంతా చిలకరించారు. రెండు రోజులు ఇంటి బయట ఉంటూ పనిమనుషులతో ఇల్లంతా తోమించారు. ఏ ఒక్క చిట్కా పని చెయ్యట్లేదు.
జనాలు ఇంటికి రావటం మానేసారు. పని మనుషులు పని మానేసారు. ఇక లాభం లేదని ఇల్లు ఖాళీ చేసేద్దామని నిశ్చయించుకున్న గురునాధం ఇల్లును అమ్మకానికి పెట్టాడు. నెల తరువాత సగం ధర పెట్టినా ఎవ్వరూ కొనడానికి రావటం లేదు. మధ్యవర్తులు కూడా కంపు ఇల్లు అని తెలుసుకుని పలకరించడం మానేసారు. గురునాధం ఆఖరికి అప్పు చేసి కొత్త ఇల్లొకటి కొనుక్కున్నాడు.
అప్పుడే ఆండాళ్ళు ఫోన్ చేసి కుశల ప్రశ్నల అడిగింది, గురునాధం జరిగిందంతా చెప్పాడు. ఆమె అంతా నెమ్మదిగా విని, తనకి ఆ ఇల్లు అంటే ఇష్టమనీ, విడాకుల జరిమానా కింద తీసుకుంటాననీ చెప్పింది.
ఆమెకి ఈ ఇల్లు ఎంత దుర్వాసనేస్తోందో తెలీదనుకొన్న గురునాధం వెంటనే ఒప్పేసుకున్నాడు, కానీ అదే రోజున ఒప్పందపత్రాలపై సంతకాలు కావాలన్నాడు. ఆండాళ్ళు సంతోషంగా ఒప్పుకుంది. సంతకాలయిపోయాయి.
ఒక వారం తరువాత తాయారు ముఖంలో సంతోషం, ఇల్లు ఖాళీ చేసేస్తున్నందుకు. కానీ ఇంట్లో సామానుతో పాటూ ఏనుగు దంతం గిన్నెల పూల సజ్జలు కూడా బండ్లెక్కేసాయి!

Thursday, July 17, 2014

"తెలుగు భాషకు ప్రాచీన హోదా వలన ఒరిగిందేమన్నా ఉందా?" అన్న ప్రజ లోని చర్చకు నా ఆలోచనలు

యాదృచ్ఛికంగా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నా తరఫున ఏం చెయ్యవచ్చు అన్న సందర్భంలో ఈ చర్చ నాకు తారసపడడం జరిగింది.
ఆ చర్చ పై నా విమర్శ వ్రాసే ముందు, అందరికీ ఒక విన్నపం
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా భావ గీతాలు వ్రాసి నా మెయిల్ ఐడీకు పంపగలరు. పాటకు కావాల్సిన అంశం - తెలుగు ప్రముఖులు, తెలుగు ప్రదేశాలు, తెలుగు విశేషాలు. మీ ప్రాంతం (జిల్లా-గ్రామ) స్థాయిలో ప్రసిద్ధులైన వ్యక్తుల గురించి తెలుసుకొని, మీ ప్రాంతంలోని ప్రముఖ ప్రదేశం గురించి తెలుసుకొని, మీ ప్రాంతపు వంటకాల గురించి తెలుసుకొని, ఇంకా ఇతర సాంస్కృతికాంశాల గురించి తెలుసుకొని, ఏవయినా పుస్తకాలు లభ్యమయితే చదివి. ఆపై ఆ విషయమై కవితలు/పాటలు/వ్యాసాలు వ్రాసి nani1only@gmail.com కు వేగు (విద్యుల్లేఖ) పంపగలరు.

ఇక పోస్టులో చెప్పబదిన విషయాల గురించి :
తెలుగు భాషా విశిష్ట కేంద్రం అనేది తెలుగు వారి సొత్తు. అది ప్రాంతాలకతీతం. ఆంధ్ర-తెలంగాణలకన్నా, ఈ రాష్ట్రాల వెలుపల ఒక అంచనా ప్రకారం అంతే మంది తెలుగు మాట్లాడే వారు నివసిస్తున్నారు[నిరూపణ అలభ్యం]. అంటే తెలుగు వారి కోసం నెలకొల్పే సంస్థకు తెలుగు వారికీ కచ్చితంగా భౌతిక సంబంధం అనవసరం. అరవ వాళ్ళు నెలకొల్పుకున్న తమిళ్ వర్చువల్ యూనివర్సిటీ తరహాలో ఒక పూర్తి ఆన్లైన్ లో పని చేసే సంస్థను నెలకొల్పుకోవాలి. అలా చేసిన వాళ్ళం మనమే మొదటి వాళ్ళం కావచ్చును కూడా. ఇక నిధులూ గట్రా ఏమయినా ఖర్చు చెయ్యాలంటే అంతర్జాలం కంప్యూటర్ అందుబాటులో లేని వారికి అవి అందించే ప్రయత్నాలకు వాడాలి. స్వామి కార్యం స్వకార్యమూ నెరవేరుతాయి. కాదూ లేదూ ఒక గుమస్తా కచేరీ కావాలంటే రెండు పెట్టుడు కార్యాలయాలు రెండు ప్రాంతాల్లో పెట్టుకోవచ్చు. మిగితా ప్రభుత్వ కార్యాలయాల సంగతేమో కానీ, విశిష్ట భాషా కేంద్రం ఒకవేళ కన్నడ, అరవం, ఓఢ్రం లా స్థాపిస్తే ఆ రెండు ప్రాంతాల కచేరీల్లో సందడే సందడి. తిరుమలకు మించిన కోలాహలం.
కేంద్రప్రభుత్వ వాటాలో 100 కోట్లు విడిగా కేవలం భాషాభివృద్ధికి ఖర్చు పెట్టేందుకు విడుదల అవుతున్నాయి. రాష్ట్ర బడ్జెట్ లో సంక్షేమ పధకాల సరసన ఏనాటికీ భాషాభివృద్ధి సరితూగలేదు. ఏ నాయకుడికీ భాషాభివృద్ధి అత్యావశ్యక అంశం కాదు కాబట్టీ. పైగా మొత్తం తెలుగు వారికీ జవాబుదారీ పుచ్చుకున్న కొద్ది మంది మధ్య తరగతి తల్లిదండ్రులు స్కూళ్ళేంటి, ఇళ్ళేంటి, ఆఖరుకి ఏడుపు కూడా ఆంగ్లంలోనే ఏడవమని పిల్లలని ఉరుముతున్నారు. వీరే ప్రభుత్వానికి మార్గదర్శకం చేసేవారూను. ఈ నాయకులంతా వాళ్ళకి నిష్పూచీ - ఏనాటికీ ఆంగ్లానికి పైచేయిగా తెలుగును ఒప్పుకోరు.
అందువల్ల పై నుంచి వచ్చిన డబ్బు అయితే సక్రమంగా ఖర్చు అయ్యే   అవకాశాలు ఎక్కువ కదా!
సాహిత్య అకాడమీ పుస్తకాలనే తీసుకోండి. ఇక్కడ బెంగుళూరులో అన్ని భాషలకన్నా అతి తక్కువ పుస్తకాలు తెలుగువే, పైగా ఒక సారి ముద్రణ పొందిన పుస్తకాలకు మళ్ళీ మోక్షం లేదు. ఆ డబ్బు ప్రభుత్వం ఖర్చు పెట్టే బదులు పాత పుస్తకాల పునర్ముద్రణకు ఏ సంస్థకు అప్పగించినా కొందరికి ఉపాధి, నాలాంటి వారికి ఆ పుస్తకాల అందుబాటూ కలుగుతాయి. తెలుగులో ప్రారంభ స్థాయి-బాలసాహిత్యం-ఇతర భాషల నుండి తెలుగులోకి అనువాదాలు చాలా తక్కువ. ఇవి లేనిదే తెలుగు మీద ఆసక్తి కలుగదు, ఇవి మొట్టమొదట రూపొందించాల్సినవి!
ఇవి లేకుండా ఎన్ని విశ్వవిద్యాలలో పీఠాలు ఏర్పరిచినా లాభం లేదు.
అయినా ఎంత కాడికీ ప్రభుత్వం ఏదో చేసిపెడుతుంది, చేసిపెట్టాలి అన్న ధ్యాసే కానీ, సామాన్యులుగాఅ మనం తెలుగుకు ఏం చేయగలము, భాషను ప్రాచీన భాషగా చూసేందుకు ఏం ఏం ఋజువులున్నాయి అన్న సంగతి సామాన్యుడికి పడుతుందా? అసలు ఇలాంటి విషయాలు తెలుసుకోడం సామాన్యుడికి ఎంతవరకూ అవసరం?
నేడు అంతర్జాలం వాడుతున్న వారు ప్రధానంగా ఆంగ్ల మాధ్యమంలో నిత్యం సంభాషణలు జరిపే వారు కాబట్టీ మనకు పెద్ద ఇబ్బంది కనిపించడం లేదు. కానీ ఈ సంఖ్య అసలు తెలుగు వారి సంఖ్యలో అత్యల్పం అనీ మనం గుర్తించం అది మన అజ్ఞానం. దాదాపు 95% మంది ఇంకా తెలుగులోనే ఆలోచిస్తారు, కూడికలు, తీసివేతలూ చేస్తారు. వీరంతా అంతర్జాలం వాడాలంటే తెలుగులో సమాచారం అంతర్జాలంలోకి వాడుకునే రీతిలో‌(యూనికోడ్)లోకి రావాలి. ఇతర భాషల వారు చెయ్యలేనిది తెలుగు వారు చేసి చూపించే అవకాశం చాలానే ఉంది. ఇంక ఏ భారతీయ భాషలో లేనంత సాహిత్యం జాతీయంగా తెలుగులో ఉంది. అదంతా అంతర్జాలానికి వికీసోర్స్ లాంటి వేదికల ద్వారా తరలించగలిగితే ఆ 95% మందికి కాస్త ఊరట కలుగుతుంది. మనందరి కసరత్తు ఈ దిశలో ఉండాలి. ఇక ఇవన్నీ బాహ్య సౌందర్యాన్ని పెంచుతాయి, కానీ లోలోపలి భావ సౌందర్యం పెంచాలంటే?
తెలుగు భాషా వైభవాన్ని తెలిపే పాటలూ, కథలూ, కవితలూ జనాల నరనరాల్లోకి వెళ్ళాలి. భాషాభిమానం అనేది ప్రతిఒక్కరికీ ఉండాల్సిన గుణం. భాషలేందే భావమే లేదు కదా!

ఇక వ్యాఖ్యలలో వ్రాసిన అంశాలపై నా ఆలోచనలు :
అసలు తెలుగు భాష ప్రాచీనమా అనే విషయంలో ఎన్నో తగాదాలు ఉన్నాయి. వేరేవారికి ఈ హోదా దొరికింది కాబట్టి మనకూ కావాలని అర్రులు చాచడం వ్యర్ధం. అలాగే ప్రాచీన భాషగా కాక ఆధునిక భాషగా పోసిషన్ చేస్తే మంచిదా అన్న ఆలోచనను తేలిగ్గా కొట్టేయలేము.
వేరే వారికి దొరికిందన్న సందర్భంలో మనమూ అడిగామన్నది చర్చనీయమే కానీ నిజంగానే తెలుగు ప్రాచీనమా కాదా అని ప్రశ్నించుకుంటున్నామంటే అది మన అజ్ఞానమే, హాలుడి గాథా సప్తశతి నాటికే తెలుగుందని మనకు తెలియవస్తుంది. కొత్తె యుగం 500 నాటికే తెలుగు ఉందన్న నిరూపణలు కలవు.  1000 కొ.యు. నాటికి నన్నయ్య వాగనుశాసనం వ్రాయగలిగాడంటే అప్పటికే తెలుగు పూర్తి వాడుకలోకి వచ్చేసింది. తెలుగు ఎంత అభివృద్ధి చెందిన భాష అంటే దక్షిణ భారత శాస్త్రీయ సంగీతపు రాగాలకు ఏ రాగానికైనా తగిన పదాలతో వినసొంపుగా సాగే భాష మనది, అంతగా భాషలోని పదాలు అభివృద్ధి చెందాయి అంటే ఏనాటి నుండీ భాష అభివృద్ధి చెందుతూ వస్తుందో అంచనా వెయ్యడమే కష్టం. నేటికీ కావ్యాల సంఖ్యలో కానివ్వండి, గద్య-సాహిత్యాల పరంగా చూడండి, లిపి అభివృద్ధి పరంగా చూడండి తెలుగు చాలా పరిణామానికి గురి అయిన భాష-ఈ విషయాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఇక తెలుగు పూర్తి ఆధునిక భాష కూడా! ఏ శబ్దాన్నైనా తెలుగులో ఆ భాష మాతృక కలవారు పలికే విధంగా వ్రాసే అవకాశం ఉంది! (భారతీయ భాషా లిపుల మీద నేను గమనించిన చిన్న విషయం)
ప్రభుత్వ రంగ బడ్జెటులను గమనిస్తే వంద కోట్లు పెద్ద మొత్తం కాదు. ఉ. చౌక బియ్యం పథకానికి రెండున్నర వేల కోట్లు కేటాయింపులు ఉన్నాయి. కేంద్రం ఇవ్వకపోయినా వంద కోట్లు పెట్టుకోలేనంత బీద స్థితిలో ఎవరూ లేరు.
 కానీ భాషాభివృద్ధికి ఖర్చుపెట్టే విధానం ప్రభుత్వం వద్ద లేదు. ఎలా ఖర్చు పెట్టాలో ప్రభుత్వానికి తెలీదు. ఏం విషయమై ఖర్చు పెట్టాలో తెలీదు. భాషాభివృద్ధికి ప్రభుత్వ పరంగా ఏం చేయవచ్చో అన్న విధి విధానాలు లేవు.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (లేదా ఇంకో అందమయిన పేరు) అంటూ భవనాలకు ఇతర హంగులకు ఖర్చు పెట్టడం ప్రభుత్వాలకు మాంచి సరదా. ఉచిత పబ్లిసిటీ, ఏదో సాదించామన్న ఊకదంపుడుతో బాటు కాంట్రాక్టర్లకు వడ్డింపులు ఉంటాయి మరి. ఆయా సంస్థలలో ఎలాంటి పరిశోధన జరగాలి, వాటి ద్వారా వచ్చే ప్రయోజనం ఏమిటి అనే విషయాలపై ఎవరికీ ధ్యాస ఉండదు.
ఈ విషయమై తెలుగు బ్లాగరులు, జాలరులకు మంచి అవకాశం ఉంది. అంతర్జాలం వేదికగా ప్రభుత్వానికి ధీటుగా ఇలా కూడా భాషాభివృద్ధికి తోడ్పడవచ్చా, ఔరా!, అని అనుకునేలాంటి పనులు మనమే చేసి చూపవచ్చు. అదీ సున్నా ఖర్చుతో.
తెలుగు భాష పునరుజ్జీవనం అంశంలో ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందుకు భాషాభిమానులు, పండితులు మరియు భాషాశాస్త్ర నిపుణులు (linguistic experts) కలిసి మేధోమధనం చేయాలి.
నేను ఈ విషయంతో ఏకీభవిస్తున్నాను.
లిపి/వ్యాకరణ సంస్కరణ, నిఘంటువులు, భాషా సరళీకరణ, మరుగున పడ్డ తేటతెలుగు పదాలను తిరిగి వాడకంలో తీసుకురావడం, పద్య రచన పునర్వైభవ ప్రాప్తి, కోల్పోయిన పద్య/గద్య సంపద పునర్నిర్మాణం, చేతిరాతల (manuscripts) స్కానింగ్/డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్/కీబోర్డు వ్యవస్థ లాంటి స్తూలాంశాలను (broad headings) ముందుగా గుర్తించాలి. ప్రతిదానిలో కొన్ని కొన్ని ముఖ్యమయిన సూక్ష్మ పరిశోదనా విషయాలను (specific research outline) ఖరారు చేయాలి. ఆయా పరిశోధనల లక్షాలు, మానవ & ధన వనరులు, కాల పరిమితి వగైరా విషయాలను రికార్డు చేసుకోవాలి.
లిపి/వ్యాకరణ సంస్కరణ : తెలుగులిపి చాలా వరకూ తాళపత్రాలపై త్వరగా వ్రాసేందుకు అనువుగా రూపుదిద్దుకుంది. అందరిలో బాగా జీర్ణించుకుపోయిన అంశం. ఇది మారాలంటే క్షేత్ర స్థాయిలో ప్రక్షాళన జరగాలి. అరవంలో ఇలా రెండు పర్యాయాలు జరిగింది. మొదట అరవంలో లేని వర్ణాలన్నీ (శ, విసర్గం, క-ఖ లకు 1,2 ద్వారా తేడా మొ॥) స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో భాషా నిపుణుల ద్వారా చేర్చబడ్డాయి, ఇవి జీర్ణించుకునేందుకు దాదాపు మూడు తరాలు పట్టింది, వెంటనే అన్నా దురై నుండి వచ్చిన సంస్కృత-హిందీ వ్యతిరేక ఉద్యమం వలన ఇవి మళ్ళీ లుప్తాక్షరాలుగా చెయ్యాలి అనీ, అంతకు ముందు వాడిన వర్ణాలనే వాడాలనే నిర్ణయం జరిగింది. ఇప్పటికీ ఈ అంశం వారిలో చాలా అయోమయాన్ని నింపుతుంది. అంతర్జాలమే అన్నీ అని నమ్ముతున్న నేటి తరానికి ఇది అవరోధం కాదు. తెలుగులిపి కష్టతరం అనుకునే వారు పూర్తి రోమన్ లిప్యంతరీకరణ వాడుతున్న రోజులివి. ఈమాట లాంటి జాలస్థలాలు RTS లో చదివే విధానాన్ని అదనంగా ఇస్తున్నాయి. లిపి పరంగా సంస్కరణలు తేవాల్సిన అగత్యం అయితే లేదు. ఇక వ్యాకరణ పరంగా ఏ విధమైన సంస్కరణలు రావాలని చూస్తున్నదీ వ్యాఖ్య రచయిత తెలుపలేదు.
నిఘంటువులు : ఇవి అత్యంత అవసరం. పారిభాషిక పదకోశాలు, మాండలిక పదకోశాలు, యాస పదకోశాలు, బూతుల పదకోశాలు, సాంకేతిక నిఘంటువులు రూపొందించడమే గాక అన్ని రకాలుగా (అంతర్జాలంలో, పుస్తకాలుగా, దృశ్యక శ్రవ్యకాలుగా) అందుబాటులోకి తేవాలి.
భాషా సరళీకరణ : తెలుగు ఇప్పటికే సరళమయిన భాష. కానీ ఎందరో సంస్కృత మోహం కలిగిన పండితుల వలన సాహిత్యంలో తేట తెలుగు మాటలు చోటు చేసుకోలేక పోయాయి. సినిమాలు ఈ విషయంలో నిరాశను ఇస్తున్నాయి. అందువలన సరళ పదాలతో సాహిత్యం రావాల్సిన అవసరం ఉంది. ప్రారంభ స్థాయి సాహిత్యం ఉండటం ఆ భాష నిలకడకు ఉపకరించే ప్రధాన తొలిమెట్టు, తెలుగులో చాలా తక్కువ ప్రారంభ స్థాయి సాహిత్యం ఉంది. ఇది బాగా అభివృద్ధి చెందాలి.
మరుగున పడ్డ తేటతెలుగు పదాలను తిరిగి వాడకంలో తీసుకురావడం : జనాలకు నిత్యం వినపడే, కనపడే వనరుల ద్వారానే ఇది జరుగుతుంది, అందుకని సినిమాలు, ఎఫెం రేడియో, వార్తా పత్రికలు, బ్లాగులు, సంభాషణలు అన్నింటా మెల్లి మెల్లిగా కొన్ని పదాలను చొప్పించాలి. సంభాషణలలోకి తేట తెలుగు పదాలను ఇమిడ్చి మాట్లాడుకోవాలి.
 పద్య రచన పునర్వైభవ ప్రాప్తి : ఇప్పటికే ఆంధ్ర ప్రభుత్వం 100 కవితలు వ్రాసిన కవులకు ముద్రించుకునేందుకు డబ్బు సహాయం అందిస్తామని వారి మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇంకా ఎన్నో సంస్థలు, ఎందరో పెద్దలు కవులకు సత్కారాలు చేస్తూ పురస్కారాలు అందిస్తున్నారు. ఈ సంస్థలు లేదా ఆ సహాయం అందించే ప్రభుత్వ అధికారులు నెల నెలా కవి సమ్మేళనాలను వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తూ కవితకు ఉండాల్సిన స్వరూపాన్ని వక్కాణిస్తూ సూచనలు పంపగలిగితే బాగుంటుంది.
కోల్పోయిన పద్య/గద్య సంపద పునర్నిర్మాణం : ఇప్పటికే ఎందరో ఈ విషయమై కృషి చేస్తున్నారు. కోల్పోయిన సాహిత్యంతో పాటూ ప్రస్తుతం ఉన్న సాహిత్యాన్ని శాశ్వత పరిచే దిశగా అందరూ కృషి చేయాలి. కానీ శాశ్వత పరచడమంటే స్కాన్ చేసి పెట్టడమనే అల్పబుద్ధి గల వారున్నంత వరకూ ఏమీ చేయలేము. పూర్తి యూనికోడ్ పాఠ్యం చేసి భద్రపరచడమే సరియయిన మార్గం. లాభాపేక్షతో కొందరు సంగ్రహ కర్తలు స్వార్ధంతో వారి వద్దనే కొన్ని అపురూప రచనలను జనసామాన్యానికి దూరంగా ఉంచుతున్నారు. వారు చనిపోవడంతో ఆ రచనలూ నాశనమవుతున్నాయి, తెలుగువారు ఈ అలవాటును విడనాడాలి.
చేతిరాతలచేతివ్రాతల (manuscripts) స్కానింగ్/డిజిటల్ లైబ్రరీ : ఒక రాష్ట్రానికి చెందిన చేతివ్రాతలను వేరే రాష్ట్రం వారు కనీసం బొమ్మల రూపంలోనైనా తీసుకుపోరాదు అన్న నిబంధనలు పెట్టే కుచించుకుపోయిన మనస్తత్వం కల వారి మధ్య మనమున్నాము. ఏం చేయగలం? కుదిరినన్ని విధాలలో వీటిని పలుచోట్ల భద్ర పరచాలి.
కంప్యూటర్/కీబోర్డు వ్యవస్థ లాంటి స్తూలాంశాలను స్థూలాంశాలను (broad headings) ముందుగా గుర్తించాలి. ప్రతిదానిలో కొన్ని కొన్ని ముఖ్యమయిన సూక్ష్మ పరిశోదనా విషయాలను (specific research outline) ఖరారు చేయాలి. : ఈ దిశగా ఎందరో ఇప్పటికే పని చేస్తున్నారు (IIT-M వారి imli, IIITH, HCU, JNTU వారి పరిశోధనలు). ఇక ఎందరో కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను (వీవెన్ గారు, ఇతర e-తెలుగు సభ్యులు, నేనూను) సంప్రదించేలా ఒక వ్యవస్థ ఏర్పడాలి.
ఆయా పరిశోధనల లక్షాలు, మానవ & ధన వనరులు, కాల పరిమితి వగైరా విషయాలను రికార్డు చేసుకోవాలి. : ఇది పరోక్షంగా, ప్రత్యక్షంగా కొన్ని సందర్భాలలో జరుగుతోంది.
ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు భాషకు ఒక మానిఫెస్టో కావాలి. ఇదంతా చేయడానికి ఎందరో పెద్దల సహకారం అవసరం. ఈ ప్రక్రియకు ఖర్చు ఆట్టే కాదు కానీ అందరినీ ఒకదగ్గర జమా చేయడం, వారి చర్చలను రికార్డు చేయడం మరియు వారి నిర్ణయాలను ప్రచురించడం కోసం ఎంతో ఓర్పు & శ్రమ పడుతుంది. Coordination, not funds, is the key to this exercise.
ఇది జరిగితే మొదటి అడుగు నాదే అవ్వాలని, పూర్తి సహకారం అందిస్తాననీ హామీ ఇస్తున్నాను.

కనీసం తెలుగుభాషయొక్క వినియోగం సరియైన దిశగానైనా జరిగేలా మనం చర్యలు తీసుకోలేని స్థితిలో ఉన్నాం. 
ఈ విషయాన్ని నేను ఖండిస్తున్నాను. ఇందుకు సరియయిన ఋజువు ఉందా? నిరూపించగలరా?
ఇక తెలుగు భాషకు ఆధునిక హోదా తేవడానికి మరో ప్రజా ఉద్యమమే రావాలి. పైన వ్యాఖ్యలో జై గొట్టిముక్కల సూచించినట్టు ఒక మానిఫెస్టో కావాలి. జాలమూ బ్లాగులూ వేదికగా మనందరమూ ఆ దిశగా ప్రయత్నం మొదలుపెట్టవచ్చు.
ఇదే మనం చెయ్యగలిగీ, ఇప్పటిదాకా చెయ్యని పని. బ్లాగరులకు ఎంతటి అవకాశం ఉందో, ఏ దిశలో పనిచేయవచ్చో తెలిసీ ఆ దిశగా బ్లాగరులు పని చేయలేకపోతున్నారు.
ఇలాంటి వారు ఒక సత్పరిమాణం కోసం సత్సంకల్పం చేస్తే మంచే జరుగుతుంది. ఫలితాలు వచ్చాక ప్రస్తుతం దూరంగా ఉన్నవారిలో చలనం వస్తుంది.
ఇదే నా మాట కూడా!

  



  

Friday, May 11, 2012

వేఁగి క్షేత్రము - విశ్వనాథ సత్యనారాయణ గారి కవిత


ఏ రాజు పంచెనో యిచట శౌర్యపు పాయసమ్ములు నాగులచవితినాళ్ళ
ఏ యెఱ్ఱసంజలో నెలమి పల్లవరాజరమణులు కాళ్ళఁబారాణులిడిరొ,
చిత్రరధస్వామి శ్రీరథోత్సవములోఁ దెలుగు పిల్లలు కత్తి త్రిప్పిరెపుడొ,
ఏ రెండు జాముల యినునివేడిమి వచ్చి కలసి పోయెనొత్రిలింగ ప్రభువుల,
నాజగచ్ఛ్రేయసంబులై యలరుతొంటి
వేంగిరాజుల పాద పవిత్రచిహ్న
గర్భిత మ్మైనయీ భూమిఖండమందు
నశ్రువులు జార్త్రు జీవచ్ఛవాంధ్రజనులు.
ఇట వేఁగీశుల పాదచిహ్నములు లెవే! లేవుపో! భావనా
స్ఫుట మూర్తిత్వమునైనఁ బొందవు నెదో పూర్వాహ్ణదుష్కాలపుం
ఘటికల్ గర్భమునం దిముడ్చుకొనియెం గాబోలు నీపల్లెచో
టట లోకాద్భుతదివ్యదర్శనమటే యాభోగ మేలాటిదో.
నీయతుల ప్రభావ మహనీయత వేఁగిపురాధిరాజమా!
ఆయతధర్మమూర్తులు మహాత్ములు వారలు బ్రహ్మకోశగో
పాయిత లాంధ్రపల్లవనృపాలురహుంకృతి వ్యాఘ్రగర్జగా
నై యరిలోకభీకర మహాద్భుత శౌర్యరసాకృతిం జనెన్.
ఈ నాపదార్పితక్షోణి నేరాజు ధర్మాసనంబుండి స్మృత్యర్థం పొందెనొ
ఈనాదృగావృతంబైన భూములలోన నేశౌర్యధనులు శిక్షింపఁబడిరొ
ఈ నాశరీరమం దివతళించిన గాలి యెంత పౌరాతన్య మేచుకొనెనొ
ఈ నాతనూపూర్ణ మైన యాకాశమ్ము నే క్రతుధ్వనులు శబ్దించినదియొ
అస్మదజ్ఞాతపూర్వదివ్యత్వ మొప్పు
నీవునీతావనీఖండ మిచట నిలచి
యస్వతంత్ర దొరలు నాయాంధ్రశక్తి
నన్నుఁగంపింపఁ జేయుచున్నది భృశమ్ము.
వేఁగి రాజ్యపు పల్లెవీధుల చెడుగుళ్ళ రిపులఁ గవ్వించు నేరువులు తెలిసి
ఎగురుగోడీబిళ్ళసొగసులో రిపుశిరస్సుల బంతులాడు శిక్షలకు డాసి
చెఱ్ఱాడి యుప్పుతెచ్చిననాడె శాత్రవ వ్యూహముల్ పగిలించు నొఱపుగఱచి,
కోతికొమ్మచ్చిలో కోటగోడల కెగఁబ్రాకి లంఘించు చంక్రమణ మెఱిఁగి
తెనుఁగులంతప్డెయవి నేర్చుకొనియు యుందు
రెన్నగాఁ దెల్గుతల్లులు మున్ను శౌర్య
రస మొడిచి యుగ్గుఁ బాలతో రంగరించి
బొడ్డుకోయని కూనకే పోయుదు రట.
శిలవోలెన్ కదలంగ లేక హృదయస్నిగ్ధార్ద్రసద్భావనా
ఖిల చైతన్యుడనై పురావిదిత వేంగీపూజ్య సామ్రాజ్యగా
ధల యోజించుచు నాంధ్రపల్లవనరేంద్ర శ్రీయశస్త్సంభమున్
బలె నిల్చుంటిన యీ పవిత్ర ధరణీ భాగంబునం దీగతిన్-
ఏ దివ్యపూరుషు లీశాద్వలాంకూరశేఖరమ్ముల లిఖించిరొ! యివెల్ల
ఈ వాయువీచిలో నేయప్సరస్సమాజము నింపిరో గీతిసముదయంబు
ఏ దివ్యశిల్పు లీరోదసీకుహరాన వ్రాసిరో దివ్యశిల్పమ్ము లిన్ని
ఈ పధాంతరమునం దేవురాణమునీంద్రసంతతులో ప్రశంసలు పొనర్త్రు
ఎటఁ గనినఁ బూర్వపల్లవ నృపచరితలె
వ్రాయఁ బడి పాడఁబడి గీయఁబడి యువిన్య
సింపఁబడి శ్రోత్ర పేయమై చెన్నుదాల్చె
నీయతీంద్రియశక్తి నాకెట్టు లబ్బె!
ఈ పొలా లెంతచేవెక్కించుకొన్నవో. గుండె వ్రయ్య సముద్రగుప్తు డడలె
ఈ నేల పావిత్ర్యమెంత కుంభించెనో చిత్రరధ స్వామి సేవలుకొనె
ఇట పల్లవులరాచయెలనాగ లేవ్రతమ్ములు చేసిరో లచ్చి నిలుకడ వడె
ఈ కాశ్యపీఖండ మేశరజ్యోత్స్నలో పిలకించెనో కీర్తి తెలుపులూరె
ఇట నెచట త్రవ్వినను బంగరేనట యది
యెంతశ్రీయొ! యదెంత రాజ్యేందిరయొ ప
దానతనఖాగ్రపాతనిర్యన్నిధాన
మైన యీచోటనుపభోగ్య మయ్యె నేడు.
ఈ పొదలం జరించుచు నహీనమహామహిమానుభావమౌ
నేపురవీధులందొ చరియించుచు నంటి నటంచుఁ భారతం
త్ర్యాపతితుండ నయ్యును పురా మహదాంధ్రమునన్ స్వతంత్రుడౌ
నేపురుషుందనో మనుచు నీ భ్రమ సత్యముగాఁ దలంచుదున్
ఏ పల్లవనృపాలు డెత్తినబావుటా చాళుక్యనృపులరాజ్యంబునందు
ఏ దేశికవిత పాలించినకవిరాజు నన్నయ్య వ్యాకరణంబునందు
ఏయులిఁజెక్కునేర్పులు మహాశిల్పి గోదావరీనదీఘోషయందు
ఏతొంటి తెలుగుల యెక్కువాచారమ్ము బలవ న్నృపుల ప్రాభవమ్మునందు
సమసిపోయెనో -- యున్మత్తసామజంబు
కొలను జొరబడి తమ్మితూడులను పెరికి
వైచెటె యెఱుంగుగాని తత్పద్మగర్భ
కేసరవిమిశ్రమధురసాగ్రియత గలదె?
ఇమ్ముగఁగాకుళమ్ము మొదలీవరకుం గల యాంధ్రపూర్వరా
జ్యమ్ముల పేరు చెప్పిన హృదంతరమేలో చలించి పోవు నా
ర్ద్ర మ్మగు చిత్తవృత్తులఁ బురాభవనిర్ణయమేని నెన్నిజ
న్మములుగాగ నీతనువున్ బ్రవహించునొ యాంధ్రరక్తముల్.
ఇది వినిపింతు నదు మది నెంచెద మిత్రులకున్ గళన్ధగా
ద్గదికము లోచనాంతబహుధాస్రుతభాష్పనదమ్ము స్పందనా
స్పదహృదయమ్ము నాపనికిఁజాలక చేసెడు నన్ను నింతగా
నెద పదిలించుకొన్న దిదియెక్కడి పూర్వజన్మవాసనో!
                                                                                           --విశ్వనాథ సత్యనారాయణ

Monday, April 16, 2012

భాషాభిమానం మితిమీరిన వేళ కూడా తెలుగు అక్షరం అ-క్షరమే

ఈ మధ్య ఒక వింత పోకడ మొదలయింది. భాషాభిమానం పేరు చెప్పుకొని, లిపి సంస్కరణలు అంటూ ఎక్కడలేని చెత్తను తెచ్చి మన తెలుగు లిపికి అంటిస్తున్నారు. విజయ లిపి అయిన తెలుగు లిపి, పద్య సాంప్రదాయం ఆ పై వచ్చిన శతక సాంప్రదాయం తరువాత వచ్చిన ప్రబంధ సాంప్రదాయం మొదలు నేటి గద్య మరియు కవిత సాంప్రదాయం వరకూను రాసేప్పుడు అతి తక్కువ శ్రమ కలిగే విధంగా, అదే సమయంలో స్పష్టంగా, దోష రహితంగా అతి తక్కువ సమయంలో రాసే విధంగా తీర్చిదిద్ద బడింది. అయితే తెలుగు లిపికేనా ఈ ప్రత్యేకత? అవును ముమ్మాటికి ఇది సత్యం. మిగితా భాషా సాంప్రదాయాల్లో రాతప్రతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు, అక్కడ గురు-శిష్య పరంపరలో ఒక తరానికి ముందు తరం వొప్పజెప్పే విధానంలో జ్ఞానం పాకేది. ఒకానొకప్పుడు జ్ఞానాన్ని పుస్తకాలుగా భద్రపరచటం నేరంగా కూడా పరిగణించేవారు(చాణక్యుని నీతి శాస్త్రం నుండి). కానీ అది ఉత్తరాది భాషలకే పరిమితం అనుకుంటాను, అందుకే చాలా వరకూ తులసీదాస్, సూర్‍దాస్,కబీర్‍దాస్,రహీమ్‍దాస్ ఇత్యాదుల దోహాలు జనాల నోట విని సంకలనం చేసినవ్ కానీ రాతప్రతులుగా వారు చెప్పిన కాలంలో చేయబడలేదు. వివరాలకు : www.esamskriti.com/essays/docfile/14_395.doc 
ఇందుకు కొన్ని కారణాలు : ౧. ప్రామాణిక లిపి లోపం, ౨. మాటకు రాత ఉండవలసిన అవసరం లేదన్న భావన, ౩. ఒకవేళ రాతలో ఉన్నా, పరదేశిల దండయాత్రలలో ఆయా రాతప్రతులు నాశనం అవడం. లేదా ౪. నోటి ద్వారా జ్ఞాన ప్రసారానికి పెద్ద పీట వెయ్యడం. 
అయి ఉండవచ్చు.
మొదటి కారణం - కొన్ని విధాలుగా సమంజసమే, అవధీ, భోజ్పురీ మున్నగు మాటలకు సరియయిన లిపి లోపం నేటికీ ఉంది.
రెండవ కారణం కూడా నిజం అవ్వవచ్చు - సమాజంలో ఒక వర్గమే చదువు నేర్చి, మిగితా వర్గాలు చదువుకు దూరంగా ఉండేవి, చదువుకునే వారి లోపం వల్ల రాతకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదేమో?
మూడవ కారణం - ఉత్తరాదిన జరిగిన అన్ని దాడులలోనూ ప్రతి సారీ ధనసంపద కొల్లగొటారే గానీ పద సంపదను నాశనం చేసింది తక్కువే అనవచ్చు, పైగా చాలా వరకు రాతప్రతులను పర్షియన్ కు తర్జుమా చేసారు కూడా.(పై లంకెలో ఇచ్చిన డాక్ ఆధారంగా)
ఇక నాలుగవ కారణమే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. 
గంగా నదికి ఇచ్చే హారతిలో పాడే పాటతో సహా ఉత్తరాదిన అన్నీ నోటి ద్వారానే నేర్పబడతాయి. పుస్తక రూపేణా ఏమీ అందుబాటులో ఉండదు.
అయితే ఇక్కడ నా అభిప్రాయం ప్రకారం ఉత్తరాదిన రాతలిపికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. లిపి సంస్కరణలు చాలా తక్కువ. శిలాఫలకాలే అందుకు సాక్ష్యం.
ఇక దక్షిణాదిన హెచ్చు సాహిత్యం రాతప్రతుల ద్వారానే తరాలు దాటేదీ, దేశాలూ దాటేది. లిపి సంస్కరణలూ ఇక్కడ చాలా పెద్ద స్థాయిలో జరిగాయి. 
హిందుస్తానీ సంగీతం(ఉత్తర భారత సాంప్రదాయం)లో స్వరాలను నేటికీ రాసి నేర్చుకున్ ప్రక్రియ కనబడదు. 
అదే కర్ణాటక సాంప్రదాయంలో అది కనిపిసుంది.
శిలా శాసనాలు పరిశీలించినా, తాళపత్ర గ్రంథాలు పరిశీలించినా తెలిసేది ఒకటే, మన వద్ద మాటక్కూ రాతకూ ఒకే ప్రాతిపదికన సమాన ప్రాధాన్యత ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే ఒకింత ఎక్కువ రాతకే పెద్దపీట వేసారు. రాత కూడా కొన్ని తరాలకు అదే విధంగా అందాలి అన్న దూరదృష్టితో ఏర్పరిచారు. నేటికీ అన్నమయ్య మొదలు వాగ్గేయకారుల కృతులు ఆ నాడు ఎలా పాడారో అదే రీతి నేటికీ పాడగలుగుతున్నామంటే అది రాతకు మన వారు ఇచ్చిన ప్రాధాన్యతను తెలియబరుస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన గమ్మత్తయిన విషయమేమంటే, ఇతర భాషల్లోలా కాకుండా తెలుగులో శబ్దానికి అత్యున్నత స్థానం ఉంది. 
శబ్దానికో అక్షరం మనకు కలదు. తిరుక్కార్తి అయిన వెంటనే జరిగే ప్రబంధ పఠనం అపుడు ழ అనే ఒక వింత అక్షరం తెలుగు అక్షరాల్లో దూరి వచ్చినపుడు కలిగే ఆశ్చర్యం, భయం,  దుఃఖం అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఆ సందర్భం నేనూ చిన్నప్పుడు ఎదుర్కున్నాను. అయితే దానికీ తెలుగులో అక్షరం ఉందని ఈ మధ్యనే సురేశ్ కొలిచాల గారి వద్ద తెలుసుకుని మిక్కిలి సంతోషపడ్డాను కూడా. తెలుగులో ఆ ప్రకారంగా ఏ శబ్దమైనా అక్షరరూపేణా ఉంది అన్న నిర్ధారణకు వచ్చాను.

కురాన్ చదివేప్పుడు మూడు రకాల లు పలకాలి ఒక క సాధారణంగా వచ్చే శబ్దం(ک), మరొకటి నాభి నుండి గాలిని తెచ్చి పలకాలి(ك), మూడవది కంఠం నుండి వచ్చే గాలిని నాలుక మధ్య భాగం ద్వారా అడ్డుపెట్టి పలకాలి(ق). 
కానీ ఇవి మూడు తెలుగ్లో ఉన్నాయి. అయితే నేటి అక్షరమాల పరిమితికి వీటిని క కగా వాడుకోవచ్చు.
అలానే జల్లెడ అన్నపుడు డ మరియు జ కలిపిన శబ్దం వస్తుంది. జడ అన్నపుడు మామూలు జ, కఁజు అన్నపుడు ద మరియు జ కలిపిన శబ్దం వస్తుంది. వీటిని కూడా ౨ మరియు ౩ లు చేర్చి చూపవచ్చు. 
ఇది బ్రౌణ్యంలో చాలా చక్కగా చెప్పబడి ఉంది.
అలానే స్త్రీ అన్న పదం రాయటానికి చాలా సులభం. అదే స్త్రీని దేవనాగరి లో రాస్తే स्त्री అవుతుంది, అదే అరవంలో ஸ்த்ரீ అవుతుంది. అంటే తెలుగులో అది మీకు ఒకే అక్షరం అయితే నాగరిలో ఒకటీముప్పావు(దాదాపు రెండు), అరవంలో మూడు అక్షరాలు పట్టే స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఇదే విధంగా ఇంకా ఎన్నో లెక్కలేనన్ని ఉదాహరణలు ఇవ్వవచ్చు. అయితే అదే సమయంలో ఘడియలో ఘ, ఝటలో ఝ చాలా క్లిష్టంగా అనిపించవచ్చు గానీ, వాటి వాడుకను అనుసరించి, వీటిలో సంస్కరణ అవసరం లేదని పెద్దలు వాటిని అలానే ఉంచేసారన్నది నా నమ్మకం. 
అయితే ఈ రాత విధానం, తెలుగులో రాత పద్ధతి కంప్యూటర్లొచ్చాక మారాల్సిన అవసరం ఉందా?
ఏం లేదు.
కారణం, ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక ఆంగ్ల ఆల్బం పాటకు లిరిక్స్ రాసేప్పుడు ఆంగ్లం వాడుతూ, రాసినపుడు, నంబ్ అనే లింకిన్ పార్క్ పాటకి నేను పాటను పది సార్లు రివైండ్ చేసి రాస్కున్నాను. పాట మరీ అంత వేగంగా ఉండదు. 
అదే సమయంలో తెలుగులో రాస్తూ ఆనతినీయరా అను పాటను నేను మూడవ సారి ప్రూఫ్ రీడ్ గా విన్నాను! 
అదనమాట మన లిపి గొప్పతనం.
ఎంతటి మాటనయినా/పాటనయినా ఎవరయినా ఆశువుగా చెబుతూంటే రాసేందుకు వీలుగా మన లిపి ఉన్నది. 
కేవలం మాటను రాతగా పెట్టేందుకు కాదు, మాటను సునాయాసంగా-శుద్ధంగా-శుభ్రంగా-తక్కువ స్థలము-తక్కువ శ్రమ వెచ్చిస్తూ రాసే విధంగా ఉంది మన భాష. 
ఇక్కడ వరకు చదివారా! హమ్మయ్యా, నా బాధ అర్ధం చేస్కున్నారని ఆశిస్తున్నాను. ఇదంతా రాసింది ఎందుకూ అంటే - మొన్నా మధ్య అచంగుడు ఒక లంకె పంచారు. అది చూసినపుడు నా కోపం గొంతు దాకా వచ్చి ఆగిపోయింది. ఆ వ్యాసానికి లంకె ఇక్కడ : http://www.namasthetelangaana.com/news/Article.asp?category=1&subcategory=5&contentid=58696 
కానీ పోన్లే ఏదో భాషపై అమితమయిన ప్రేమ అనుకుంటూ వదిలేసాను. అయినా ఏదో ఒక రోజు ఆ వ్యాసం, దానికి తోడుగా అతను రాసిన ఒక పుస్తకం ఉంది, అదీ పట్టుకుని అతని వద్ద అన్నిటికీ సంజాయిషీ తీస్కోవాలని ఎలాగు అనుకున్నాను. 
భాషను నేనొక వ్యక్తిగా, ఇంకా చెప్పాలంటే మాతృసదృశంగా చూస్తాను. కొన్ని అక్షరాలను తీసెయ్యటం అంటే ఆ అమ్మకు చేతులు, కాళ్ళు విరగ్గొట్టమనడమే. మాట్లాడే భాషలో లేని రాత భాషలో ఉన్న అక్షరాలు కేవలం కాల్పనికాలు. నేను మాట్లాడేదే ప్రామాణిక భాష అనీ, దానికి సరిపడా అక్షరాలుంటే రాతకు చాలు అనటం చాలా పెద్ద పొఱపాటు. 
అయితే స.వెం. రమేశ్ గారు ఈ నెల నడుస్తున్న చరిత్రలో ఒక వ్యాసం రాసారు. 
అక్కడ ఆయన చెప్పినదేమిటంటే, మన తెలుగు వ్రాలు(వ్రాత కు ఆయన వాడిన నామవాచకం - నాకయితే బాగా నచ్చింది, ఇకపై వాడదామనుకుంటున్నాను)లో అక్షరాలు చిన్న పిల్లలకు నేర్పించటానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని, వాటిని తత్‍క్షణమే మార్చాలనీ. 
ఆ వ్యాసంలో కొన్ని అంశాలు ఇక్కడ రాస్తూ, వాటికి నా ఆలోచనలు జోడిస్తున్నాను.
౧. ఆఅ, ఉఊ,ఋౠ,ఎఏఐ,ఒఓఔ, ఒకే వర్గంలో ఉంటూ చూడటానికి ఒకేలా ఉన్నాయి, మరి ఇఈ లు ఎందుకు వేరుగా ఉన్నాయి? - భాషలో ఉచ్చారణకి పెద్దపీట వెయ్యాలి. స్పష్టత పలుకులో ఉండాలి. రాత అనేది కేవలం పలుకులను దాచే ఒక అత్యంత న్యూనతమయిన విధానం. నేటి సాంకేతికతవలన పలుకులను మనం ఆడియోలో కూడా భద్రపరచవచ్చు, అలాంటప్పుడు సారూప్యతలు వెతకనక్కరలేదు. ఇఈ లు ఒకలా లేవని అవి నేర్చుకోను అనే వాడు a ని u ని ఒకేలా పలకటానికి ఎందుకు సిద్ధమవుతున్నాడు? నాకు తెలుగు ప్రాథమికంగా బడిలో నేర్పబడలేదు. కానీ ఇంటి వద్దనే నేర్చుకోవలసి వచ్చింది. కారణం వాడుక, బడి మినహా ఇంటా బయటా అంతా తెలుగే ఉండేలా మా అమ్మా-నాన్నలు జాగ్రత్త పడ్డారు. ఆ వాడుకని బట్టీ అవసరం ఏర్పడి తెలుగు వ్రాత, మాట నేర్చుకున్నాను. నాలా ఎంతో మంది ఉన్నారు. భాష నేర్చుకోవాలంటే అందులోని మీనమేషాలు ఎంచరాదు.
౨. అ పక్కన సున్నా పెడితే అమ్ అని చెబుతున్నారు కదా. అంమ అని రాస్తే తప్పు ఎలా అవుతుంది? 'బమ్‍గారు పమ్‍టలే పమ్‍డుతాయి' అని అన్నారు ‍- ఆ కొద్ది మందికీ తెలుగు వర్ణమాల అర్ధం కాలేదు. ప్రతి వర్గానికి పఞ్చమ అక్షరం ఉంది. ఆ వర్గం మొత్తం అనునాసికం వచ్చినపుడు ఆ పఞ్చమ అక్షరాన్ని పలుకుతాము. అందుకని ఆ పఞ్చమ అక్షరం ఉన్నది. 
ఎంత ప్రయత్నిఞ్చినా గంగ గఙ్గ అవుతుందే తప్ప గఞ్గ, లేదా గణ్గ, గన్గ,గమ్గ అవ్వదు. 
ఇది ఉచ్చారణ సక్రమఙ్గా చేసే ఎవరయినా సులువుగా చెప్పగలరు. 
బమ్‍గారు పమ్‍టలే పమ్‍డుతాయి అని ఏ తెలుగు వాడూ చచ్చినా పలకడు, బఙ్గారు పణ్టలే పణ్డుతాయి అన్నది అప్రమేయ ఉచ్చారణ. 
౩. ౠ తో మాటల్లేనపుడు దానిని ఎందుకు చేర్చుకోవాలి?- ఇక్కడ మరలా ఇదే విషయం వక్కాణిఞ్చి చెప్పాలి, భాషకి రాత ఉన్నది అన్ని శబ్దాలను రాత రూపంలో చూపేందుకు. నోటిలోండి గాలి నాభి గుండా వచ్చేప్పుడు పెదాలను వృత్తాకారం చేసి, నాలుక కొనతో ఆ గాలికి రాపిడి చేస్తే వచ్చే శబ్దమే ౠ. భాష రాతలో ఒక శబ్దం లేకున్నా అది వైకల్యం గల భాషే. పైన చెప్పబడిన ழ ప్రబంధాల్లో వచ్చినపుడు ఒక తెలుగు పిల్లవాడు ఒకింత బాధ పడేది తెలుగు రాతలో ఈ శబ్దం లేదనే. ఈ అక్షరానికి తెలుగులో పదాల్లేవని ఈ అక్షరాన్ని తీసిపారెయ్యలేము. 
౪,౫ కూడా పై వాటిని పోలి ఉన్నవే.
౬. య గుణింతములో యి యీ లకు గుడిని ఎందుకు తగిలించడంలేదు? - పైన చెప్పిన విధంగా తెలుగు లిపి అత్యల్ప సమయంలో అత్యధికంగా రాసేందుకు సంస్కరించబడిన లిపి. అందువలన రాయటానికి వీలుగా ఉండాలని ఎక్కువ సార్లు వాడే వాటిని ఇలా మార్చుకుని రాసారు. అంచేత వీటిని పెద్దవారిమాట చద్దన్నం మూటలా మనమూ పాటిస్తున్నాం. ఇది సులువైన విధానం కాబట్టే జనం మారలేదు. గుడి జోడించి రాయటమే సులువయితే, ఈ అక్షరాలు రాసేవారము కాదు.
౭. క కింద ష పెట్తినపుడు క్‍ష అవ్వలి కానీ క్ష ఎందుకు అవుతుంది? - ఇదే ప్రశ్నకు దగ్గరగా జంపాల చౌదరి గారు నన్నొకసారి అడిగారు, చౌదరి గారి ప్రకారం తెలుగులో క్ష ఉంది, అలానే క్‍ష కూడా ఉంది. ఆయితే కక్ష, రిక్షా లాంటి పదాల్లో క్ష ఉంటుందని ఫిక్‍షన్, డికాక్‍షన్ వంటి పదాల్లో క్+ష వస్తుందని వారు చెప్పారు. మొదటిది పలకటంలో క-ష కలిపి ఒకే స్వరంలో పలికేస్తాము, రెండవ రకంలో క పలకటానికి ష పలకటానికీ మధ్య కొంత అత్యల్ప సమయం వస్తుంది. అందువలన క కింద ష వత్తు పెడితే అది క్ష కాదు. క మరియు ష కలిపి ఒక శ్వాసలో పలికితేనే అది క్ష, కొద్దిపాటి తేడాతో రెండు శ్వాసలలో పలికితే అది క్‍ష. అదృష్టమో ద్దురదృష్టమో రెండవ జాతి పదాలు క్‍ష ఉన్నవి తెలుగులో లేవు.
మిగితా అంశాలపై చర్చ తదుపరి టపాలో...

అందాకా అందరూ చూసి విశ్లేషించుకునేందుకు స.వెం. రమేశ్ గారు ప్రతిపాదించిన అక్షరమాల :



Wednesday, February 22, 2012

భాషందం అజంతం

మన భాష అందమైన భాష. అజంతమైన భాష.
మరి ఈ అజంతమనగా ఏంటి?
అజంతం -- అచ్చు+అంతం.
అనగా అచ్చుతో అంతమయ్యేది.
తెలుగు నుడి ఇది -- ఏ పదమూ హల్లులతో ముగియదు!
అమ్మ - అ తో ముగుస్తుంది
ఆవు - ఉ తో ముగుస్తుంది
ఇల్లు - ఉ తో ముగుస్తుంది
ఈగ - అ తో ముగుస్తుంది
...

మానస్ - స తో ముగుస్తుంది - తెలుగు కాదు, సంస్కృతం
రమేశ్ - శ తో ముగుస్తుంది - తెలుగు కాదు, సంస్కృతం కూడా కాదు (సంస్కృతంలో నపుంసక లింగం)

...

మన భాష హల్లుతో ముగియదు, హలంతం కాదు. అజంతం, అమరం, అందం.

అదనమాట సంగతి

Thursday, December 15, 2011

తెలుగు వికీపీడియా లో జాలాధారిత ఖతులు

ఇక పై తెలుగు వికీపీడియా లోని వ్యాసాలను లోహిత్ తెలుగు, పోతన, వేమన ఖతులలో చూడవచ్చు.

దీనికి సంబంధించిన అమరిక కుడి వైపు పైన ఉన్నా లంకెలలో మొదటి దాని పై మౌస్ ను నిలిపితే కనిపిస్తుంది.




Friday, September 16, 2011

లోహిత్ తెలుగు మెరుగయిన ఖతి వచ్చిందోచ్!

మనకు తెలుగులో యూనికోడ్ లో అందుబాటులో ఉన్న ఖతులు చాలా తక్కువ.
గౌతమి, పోతన, వేమన, కాకుండా, అత్యధికంగా వాడుకలో ఉన్నా ఖతి లోహిత్ తెలుగు.
రెడ్ హ్యాట్ సంస్థ వారు నిర్వహిస్తున్న ఈ ఖతిలోని అక్షరాలు చాలా గుండ్రంగా స్పష్టంగా ఉంటాయి.

లోహిత్ తెలుగు ఖతి వచ్చాక రాతఖతుల లోటు తీరింది అనే చెప్పాలి.
ముఖ్యంగా డ గుణింతం, క గుణింతం చాలా చక్కగా ఉంటాయి. పాత కాలపు వ్రాతల్లా ఉండే క గుణింతం చూసి అప్పుడప్పుడు మా తాతల నాటి ద్రవిడ ప్రతులు, తెనుఁగు ప్రతులలో వంటి అక్షరాలు అని మురిసిపోయిన సందర్భాలూ ఉన్నాయి.

పోతన లో సంయుక్త, సంశ్లేష అక్షరాలు వ్రాస్తున్నప్పుడల్లా కొంచెం ఇబ్బందిగా ఉండేది. అక్షరాలు ఒకటి మరోదాంట్లో కలిసిపోయి, వికారంగా అనిపించేది. వేమన వ్రాతఖతిగా ఉపయోగించలేము. వేమన ఖతి శీర్షికలు రాయటానికి బావుంటుంది. అన్ని మెలికలు ఉండేసరికి పెద్ద పాఠ్యాలు చదవాలంటే కొంచెం ఎబ్బెట్టుగానే ఉండేది. గౌతమి అనగానే ఎందుకో, కొన్ని అక్షరాలు మరీ యాంత్రికంగా ఉంటాయి. పైగా ఆ ఖతి స్వేచ్ఛా ఖతి కాదు. అందుకని కొంచెం బావున్నా వాడలంటే ఇబ్బందే.
అందుకని లోహిత్ తెలుగు వచ్చాక నాకు ఎంతో మేలు జరిగిందని చెప్పొచ్చు. తెలుగ్లో రాయాలన్నా, చదవాలన్నా, మరింత అందంగా అక్షరాలు కనిపిస్తుంటే ఎవరికయినా నచ్చదు మరీ?
పైగా ఎన్నో చోటల మన ఆద్య గురువులు ఈ ఖతిని వాడుతున్నారు కూడా.

ఇక లోహిత్ తెలుగు చరిత్ర తెల్సుకుందాం. లోహిత్ తెలుగు ను ప్రాయోజితం చేస్తున్న ఫెడోరా ప్రాజెక్టు లోని వికీ ప్రకారం,
౨౦౦౪ లో రెడ్ హ్యాట్ సంస్థ అయిదు భారతీయ భాషలకు జీపీఎల్ లైసెన్స్  ద్వారా స్వేచ్ఛా ఖతులను విడుదల చేసింది. సంస్కృతంలో ఎఱుపు అని అర్ధం వచ్చే లోహిత్ అన్న పేరుతో వీటిని విడుదల చేసారు. ఈనాడు అస్సామీ, బెంగాలీ, దేవనాగరీ(హిందీ, కశ్మీరీ, కొంకణీ, మైథిలీ, నేపాలి,మరాఠీ, సింధీ), గుజరాతీ, కన్నడ, మళయాళం, ఒడియా, పంజాబీ, అరవం ఇంకా తెలుగు, మొత్తం ౧౬ భారతీయ భాషలకు లోహిత్ ఖతులు అందుబాటులో ఉన్నవి.
ప్రస్తుతం ఫెడోరా ప్రాజెక్ట్ వారు ఈ ఖతుల నిర్వహణ చూస్తున్నారు. లోహిత్ ఖతులన్నీ యూనికోడ్ ౫.౧ అనుకూలం.

అయితే మిత్రులు చాలా మంది గమనించే ఉంటారు ఫస్ట్ అన్న పదం రాసినప్పుడు తలకట్టు స మీద ఉండి పొల్లు పక్కకు పోవడం లోహిత్ తెలుగులో ఉన్న అపచారం, అలానే చూస్తున్నాం, రాస్తున్నాం అన్న పదాలు రాసినప్పుడు న్నాం అన్న ద్విత్వ-సంయుక్తాక్షరం(మిశ్రాక్షరం) న, నకారప్పొల్లు, దీర్ఘం, సున్నాలుగా విడిపోతుంది, ఇదీ ఒక పెద్ద లోటే.
కానీ మొన్న ౩౦ ఆగస్టు ౨౦౧౧ నాడు లోహిత్ తెలుగు వారి అత్యాధునిక ౨.౪.౬ వెర్జన్ విడుదలయింది.
ఇందులో ఇలాంటి తప్పిదాలను సరి చేసారు.
ఇంకెందుకు ఆలస్యం వెంటనే  లోహిత్ తెలుగు ఖతిని ఇక్కడ నుండి దింపుకోండి.

సూచన :
కానీ "-" (హైఫెన్) ఈ ఖతిలో లుప్తమయింది. అలానే ఆంగ్లం లో V అక్షరం (పెద్దబడి వీ అక్షరం), ఫుల్స్టాప్, రాసి వాటికి లోహిత్ తెలుగు ఆపాదిస్తే అవీ లుప్తమవుతున్నవి. వీటిపై ఒక బగ్ ఫైల్ చేసాను. అలానే అదే బగ్ తో పాటు బగ్ ఫిక్స్ కూడా పెట్టాను. తదుపరి విడుదలలో ఇవి పొందుపరుస్తామని నాకు విజ్ఞప్తి అందింది.

Wednesday, July 27, 2011

తెలుగుబాట ఇంకా భవిష్యత్తు లో తెలుగు కై చేయవలసిన కార్యక్రమాలు

వచ్చేనెల ఆగష్టు 28 వ తేదీన జరగబోయే తెలుగుబాట కార్యక్రమానికి నాందిగా ఈ రోజు జరిగిన సమావేశంలో 


ఈ క్రింది ప్రతిపాదనలు చేశాము... 
1. ఒక కొత్త తెలుగు ఖతి (ఫాంట్) రూపొందించాలి. ఈ ఫాంట్‌తో ఈ-పుస్తకాలు తయారు చేసుకుంటే, ఆ పుస్తకాల్లోని అక్షరాలు అందంగా కనిపించాలి.
2. తెలుగు బాట జరగటానికి ఒక వారం రోజులు ముందుగా అందేలా టీ షర్టులు తెలుపు, నలుపు రంగుల్లో తయారు చేయించాలి. ఈ టీ షర్టులను ముఖ్యంగా అక్కడ బాటలో పాల్గొనేవాళ్ళు ధరించాలి. ఈ టీ షర్టులకు ఎవరైనా చక్కని డిజైన్ చేస్తే, వారికి ఒక టీ షర్టు ఉచితంగా ఇవ్వబడుతుంది.
3. వెంటనే స్టిక్కర్లు, కరపత్రాలు తయారు చేయించి అందరికీ పంచాలి. తెలుగుబాట గురించి ప్రస్తావిస్తూ ఈ స్టిక్కర్లు, కరపత్రాల కోసం ముద్రించవలసిన మంచి విషయాలను తెలియజేసిన వారికి కినిగెలో పుస్తకాలు కొనడానికి రూ.50/- విలువైన గిఫ్ట్ కూపన్ ఇవ్వబడును.
4. తెలుగుబాటలో ప్రదర్శించటానికి ఒక పెద్ద బ్యానర్ తయారు చెయ్యాలి. దానికి కావలసిన ఒక చక్కని నినాదాన్ని సూచించినవారికి కినిగెలో పుస్తకాలు కొనడానికి రూ.50/- విలువైన గిఫ్ట్ కూపన్ లుఇవ్వబడును.
5. తెలుగుబాటకు సహాయకంగా ఉండటానికి వీలైనవారు Laptops, Data cards పట్టుకొని రావాలి.
---------------------------x--------------------------------------x----------------------------------------------------

భవిష్యత్తులో చేపట్టాలనుకుంటున్న ప్రకరణాలు.... (ప్రకరణం = ప్రాజెక్ట్)

1. ఒకటవ తరగతి నుంచి పదవతరగతి వరకు గల తెలుగు మీడియం పుస్తకాలలోని పాఠ్యాంశాలను డిజిటల్ రూపంలో అంతర్జాలంలో అందుబాటులో తేవాలి. ప్రస్తుతమున్న కష్టతరమైన భాషలో కాకుండా సరళతరమైన భాషలో అందించాలి. ఆ పాఠ్యాంశాలకు చక్కని రంగుల బొమ్మలు జత చేస్తూ, విద్యార్థులకు సులభంగా అర్థమవ్వడానికి యానిమేషన్లు కూడా జతచెయ్యాలి. కేవలం సిలబస్‌లో ఉన్న విషయాలు మాత్రమే కాకుండా, ఇంకా ఎక్కువ విషయాలను ప్రొందుపరచాలి. వీలైతే, నిపుణులతో వీడియోలు తయారు చేయించాలి....

2. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇంగ్లీషు సులభంగా నేర్చుకునే ఉపకరణాలను అంతర్జాలంలో అందుబాటులోకి తేవాలి... అంటే తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా ఉండాలి.

3. మనకున్న చట్టం ప్రకారం, ప్రతి వస్తువుపై నిబంధనలు, ఆ వస్తువు తయారు చేసిన కంపెనీ పేరు వగైరా విషయాలను తప్పనిసరిగా అది అమ్మబడే ప్రాంతంలోని భాషలోనే ముద్రించాలి. దీనికి చేయవలసిందల్లా ఆ వస్తువుపై ముద్రించిన email address లేదా ఫోన్ నెంబర్ లేదా వారి కంపెనీ వెబ్ సైట్ ద్వారా మనం తెలియజేస్తే చట్టంలోని రూల్ ప్రకారం వాళ్ళు స్థానిక భాషలో ఆయా సమాచారాలను అందించాలి. దీనిద్వారా పరోక్షంగా తెలుగులోనే చదువుకున్నవారికి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది..

-----------------------------------x------------------------------------x-------------------------------------------------------

కొన్ని చర్చించవలసిన ప్రశ్నలు...

1. ప్రపంచభాషలతో పోలిస్తే తెలుగు భాష యొక్క గొప్పతనం ఏమిటి?

2. ఇంజనీరింగ్‌లో తెలుగు ఒక సబ్జెక్ట్ గా ఉండాలి. దీనివల్ల తెలుగులో పి.హెచ్.డీ లేదా పీజీ చేసినవారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

3. కనీసం పదవతరగతి వరకు తెలుగు మీడియంలో చదవడం వల్ల విషయాలపై ఎక్కువగా అవగాహన ఉంటుంది. ఇంకా మన సంస్కృతి, సాంప్రదాయాలకు పరిరక్షించినవాళ్ళం అవుతాం.

4. ప్రస్తుతకాలంలో చదువు ఒత్తిడి వలన ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థుల్లో తెలుగు మీడియం విద్యార్థులు ఎక్కువా? లేదా ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు ఎక్కువా?

Thursday, June 30, 2011

తెలుగుకై నా సంకల్పం

అందరూ కొంచెం జాగ్రత్తగా చదవండి,
చదివాక మీ అమూల్యమైన సూచనలు, సలహాలు, వనరులు, సహాయం అందించవలసినదిగా నా వేడుకోలు.

మన మాతృభాష తెలుగుకు మన రెండు తరాల ముందు నుండి జరుగుతున్న వివక్ష చూస్తూనే ఉన్నాం. నేటి పరిస్థితి ఎలా ఉంది అంటే తెలుగు పదాలు కొన్ని పలికితేనే ఇబ్బంది గా నామోషీగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది.

కాగా, అదే సమయంలో ఎంతో ఉత్సాహం తో తెలుగు నేర్చుకోవాలి అనుకునే వారెందరికో తెలుగు నేర్చుకునేందుకు మంచి సాధనాలు లేనే లేవు.

అందుకని త్వరలో నేను ఒక జాల గూడు ప్రవేశపెడదామనుకుంటున్నా, ఈ గూడు పూర్తిగా తెలుగును అభివృద్ధి చేసేందుకు ఉపయోగించుకోవాలి.

ఇప్పటి వరకూ నా ఆలోచన ప్రకారం, తెలుగు భాష ప్రాథమికాంశాలు - అక్షరాలు, వ్యాకరణం, ఉచ్చారణ మొఁ
తెలుగు పద్యం, తెలుగు కథ, తెలుగు పాట ను అందరి వద్దకూ తీసుకుపోవాలి. అలానే ఆఫ్లైన్ కొన్ని పోటీలు పెట్టి తద్వారా అంతర్జాలం అందుబాటులో లేని వారు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేలా చెయ్యటం వంటివి కొన్ని.

ఇంకా ఏంఏం చెయ్యొచ్చు?
బ్లాగుల్లో ఇందుకు కావలసిన చాలా సామగ్రి ఉంది కాబట్టి, నేను పెట్టబోయే జాలగూడు కేవలం ఆయా బ్లాగుటపాలకు లంకె ఇస్తుంది.
అలానే ఆయా టపాలు ఏదో ఒక దృక్కోణంలో రాయబడి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒక సమభావన కలుగజేసే టపాలకే స్థానం కలిపించాలన్నది నా సంకల్పం.

Saturday, December 4, 2010

లినక్స్ వాడకపోవటానికి గల కారణాలు

చాలా రోజులైంది బ్లాగు లో ఒక టపా రాసి. నా శిక్షణకాలం కావటం వలన నాకు సమయం అస్సలు కుదరటం లేదు.
ఇన్ని రోజులకి సమయం కూర్చుకుని ఈ బ్లాగు రాస్తున్నా!

తెలుగు వాడకాన్ని మన సంగణక యంత్రాల్లో పెంపొందింప చెయ్యటం అనేది ఇప్పుడు నా ముఖ్య లక్ష్యం
అందుకు లినక్స్ వాడకం ఒక మంచి దారి. మరి చాలా మంది లినక్స్ వాడాలంటే భయపడతారు.
ఇందుకు నేను మన ఈ-తెలుగు వారు నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శన స్టాల్ లో ఒక చిన్న ప్రదర్శన మరియు అంకోపరిని తెచ్చుకునే వారికి లినక్స్ స్థాపన వంటివి ఒక రోజు నాకు ఖాళీ ఉన్న రోజు చెయ్యాలనుకుంటున్నా.
ఇది నేను ఇంకా ఈ-తెలుగు వారితో సంప్రదించి ఏ రొజు జరుగుతుందో తరువాత చెపుతాను.
అయితే సంగణక యంత్ర వాడుకర్లు లినక్స్ ను ఎందుకు వాడరో.
లేక లినక్స్ వాడకంలో వారికి ఏమి ఇబ్బంది గలదో వారు నా బ్లాగాభిముఖంగా తెలిపితే
ఆయా అంశాలను నా ప్రదర్శన లో చేర్చి వాటిపై అవగాహన కలిపిస్తాను
వృత్తిరీత్యా నిబద్ధులు ఏమీ చెయ్యలేరు వారు వారి కంపెనీ చెప్పిన నిర్వహణ వ్యవస్థనే వాడాలి
అలా కాకుండా మిగతా వారు మీ మీ అభిప్రాయాలను మీ వ్యాఖ్యలుగా ఇక్కడ పెట్టండి
అలానే ఎన్నో లినక్స్ మరియు ఇతర స్వేచ్ఛామృదోపకరణాల యొక్క డాక్యుమెంటేషన్ తెలుగులోకి అనువాదం కావలసి ఉంది అందువలన ఇటువంటి వాటికి ఎన్తమంది ఉత్సాహంగా ఉన్నారో తెలుపగలరు

॥ సత్కృతాయాస్తు మంగళం ॥

Saturday, October 23, 2010

ఉబుంటు పంపకంలో తెలుగు ఖతులను స్థాపించే విధానం

ఉబుంటు పంపకంలో by default, పోతన మరియు వేమన ఖతులు ముందుగానే స్థాపితమై ఉంటాయి. అవి కొందరికి నచ్చవచ్చు మరికొందరికి నచ్చకపోవచ్చు.
ఒకవేళ మీరు కొత్త ఖతులు స్థాపన చేయదలచుకుంటే, అదెంతో సుళువు.
ముందుగా ఆయా ఖతులను డౌన్లోడ్ చేసుకుని ఆ టీటీఎఫ్ దస్త్రాలను su గా 
/usr/share/fonts అనే ఫోల్డర్ లోకి కాపీ చేస్కోండి ఆ పై ఈ కమాండ్ ను రన్ చెయ్యండి 
fc-cache -fv
ఇది రన్ చేసాక మీ యంత్రంలోకి ఆయా ఖతులు స్థాపితమవుతాయి 
లేదా పై కమాండ్ ను రన్ చెయ్యకుండానే సిస్టంను రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది 
కొన్ని మంచి తెలుగు ఖతులు :